Third wave: చైనాలోని ఉహన్ లో జన్మించి కరోనా వైరస్ మొదటి వేవ్ అయిపోయింది అనుకునే లోగానే సెకండ్ వేవ్ మొదలైంది.. ఇది ఎందరో ప్రాణాలను బలిగొంది.. ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిదని ప్రభుత్వాలు అన్ని చోట్ల లాక్డౌన్ విధిస్తున్నాయి.. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో థర్డ్ వేవ్ దూకుడు చూపిస్తోంది.. సెకండ్ వేవ్ ముగియకముందే థర్డ్ వేవ్ గురించి కొన్ని ఆందోళనకర విషయాలు వెలుగుచూస్తున్నాయి.. రాబోయే థర్డ్ వేవ్ కారణంగా పిల్లలు, యువత ప్రభావితం కాబోతున్నారు.. రానున్న కరోనా కొత్త ట్రెండ్ ఎలా ఉండబోతుందో అంచనాలు వేస్తున్నారు పరిశోధకులు..
లక్షణాలు :
*కొన్ని రాష్ట్రాలలో మొదలైన థర్డ్ వేవ్ రిపోర్ట్స్ ఆధారంగా ఆధారంగా కరుణ చూపిన మూడు నాలుగు వారాలలో కూడా పిల్లల్లో కరోనా లక్షణాలు కనబడటం లేదట.
*మూడు నాలుగు వారాల తరువాత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే ఈ విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు.
*కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, ఒంటిపై దద్దుర్లు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
*కళ్ళు ఎర్రబడటం, నాలుక, పెదాలు ఎర్రగా మారటం, కడుపునొప్పి, 102 డిగ్రీల జ్వరం రావటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చిన్నారులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు..
*అయితే ఈ సమయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ప్రమాదానికి ముప్పేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
తీసుకోవాల్సిన పోషకాలు :
*కరోనాను సహజ సిద్ధంగా నివారించే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచటం అనేది ముఖ్యమైన అంశం.
* టాబ్లెట్ల కంటే కూడా రోజువారీ ఆహారం ద్వారానే ఇమ్యూనిటీ పెంచమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
*సరైన పౌష్టికాహారం అందిస్తే పిల్లల్లో ఇమ్మ్యూనిటి లెవెల్స్ పెరుగుతాయి. ఏదో రకంగా వాటిని తినిపించాలి.
*బాదం పప్పు ఇందులో విటమిన్ ఇ, మ్యాంగనీస్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ సిస్టంని చాలా బలంగా మెరుగుపరుస్తాయి.
*అలాగే సిట్రస్ ఫ్రూట్స్ బత్తాయి, కమల, జామ పండ్లను ప్రతిరోజు అందించాలి.
*ప్రతి రోజూ తప్పకుండా పెరుగును పెట్టాలి. వీలైతే దద్దోజనం లాంటివి మంచిది.
*పాలకూర, గుడ్లు, చిలకడ దుంప, కందిపప్పు, పెసరపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వీటన్నింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.