Corona : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా Corona వైరస్ చైనా దేశం లో పుట్టిన సంగతి తెలిసిందే. 2019 వ సంవత్సరంలో నవంబర్ నెలలో చైనా దేశంలో వ్యూహన్ నగరం లో బయటపడ్డ ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలో అన్ని దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకి ప్రపంచంలో దేశాల ఆర్థిక వ్యవస్థ తలకిందులు అవటమే కాక చాలామంది ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది.
ఒక విధంగా చెప్పాలంటే భూమి మీద మనిషి మనుగడ ఇక ఉండదేమో అన్న రీతిలో ఈ వైరస్ ప్రభావం చూపించింది. ప్రస్తుతం వైరస్ను ఎదుర్కోవటానికి చాలాచోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో కొంతమేర దేశాలు మళ్లీ మామూలు స్థితిలోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వైరస్ ని కావాలని డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోకి విడుదల చేసినట్లు అప్పట్లోనే అనేక దేశాలు ఆరోపించడం జరిగాయి. ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఈ వైరస్ మూల కారణం అన్నది ఏంటి అనే దాని గురించి దర్యాప్తు ప్రారంభించింది. చైనా దేశంలో అడుగుపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 14 మంది ప్రతినిధులు చైనాలోని వూహాన్ లో నెలరోజుల పాటు పరిశోధన చేయనున్నారు. మనిషికి కరోనా ఏవిధంగా సంభవించింది వైరస్ లీక్ అయినట్లు .. ఆరోపణలు వస్తున్నా వూహాన్ వైరాలజీ ల్యాబ్ ను కూడా పరిశీలించడానికి ఈ బృందం రెడీ అయినట్లు ఈ దెబ్బతో అసలు విషయం బయట పడితే చైనా కి మూడినట్లే అనే టాక్ అంతర్జాతీయ స్థాయిలో టాక్ వస్తోంది. అంతేకాకుండా మహమ్మారి బయటకు వచ్చిన తర్వాత ఎవరినైతే ఎఫెక్ట్ చేసిందో కరోనా తొలి పేషెంట్ ని కూడా ఈ బృందం విచారించనున్నట్లు సమాచారం. చాలా దేశాల నిఘా విభాగాలు కావాలండి చైనా ప్రభుత్వం వూహాన్ వైరాలజీ ల్యాబ్ లో ఈ వైరస్ నీ దాచిపెట్టి ప్రపంచంలోకి రిలీజ్ చేసిందని ఆరోపించడం జరిగాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఆ ల్యాబ్ లో అడుగుపెట్టే అవకాశం ఉండటంతో మరిన్ని కొత్త విషయాలు బయట పడటం గ్యారెంటీ అని టాక్ ఇంటర్నేషనల్ స్థాయిలో వస్తుంది.