Corona Vaccine : ప్రపంచమంతా కరోనా వైరస్ టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ తయారయ్యి సరఫరా చేసేటప్పుడు మాత్రం విపరీతంగా భయపడుతున్నారు. గత రెండు మూడు నెలల్లో పరిస్థితులు విచిత్రంగా మారిపోయాయి. వ్యాక్సిన్ లేకపోతే ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పే అని అనుకుంటున్న సమయం నుండి అది వేసుకుంటే కూడా ప్రాణభయం అన్నట్లు పరిస్థితి తయారైంది.
అయితే భారతదేశంలో విశేషం ఏమిటంటే ఇక్కడ రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి పూణే కంపెనీ లో తయారైన కోవిషీల్డ్ కాగా ఇక రెండోది హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్. మొదటి దశలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ లు వేస్తున్నారు. వీరిలో వైద్యులు అధికశాతంలో ఉన్నారు. అయితే వీరందరూ వీరంతా కోవిషీల్డ్ వేసుకునేందుకు రెడీ అంటున్నారు కానీ కోవాగ్జిన్ మాత్రం వద్దు వద్దు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం అయితే రెండు రకాల వ్యాక్సిన్లను పెద్దఎత్తున కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు తరలిస్తుండగా కోవిషీల్డ్ విషయాలు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎలాంటి షరతులు లేవు. అయితే కోవాగ్జిన్ వేసుకోవాలంటే తమంతట తామే ఇష్టపడి వ్యాక్సిన్ వేయించుకున్న ట్లు ఒక పత్రం పై సంతకం చేయాలి. దీంతో కోవాగ్జిన్ వేసుకునేవారికి అలా పెట్టిన నిబంధనలు చూసి అనుమానాలు మొదలైపోయాయి.
ఇంకా పూర్తి వివరాల్లోకి వెళితే…. ముంబై లోని జెజె ఆసుపత్రికి కోవాగ్జిన్ డోసులు వచ్చి పది రోజులైంది. అయితే ఇప్పటికి కేవలం వంద మంది మాత్రమే దానిని వేసుకున్నారు. వెయ్యి మందికి పైగా పని చేసే అంత పెద్ద ఆసుపత్రిలో 10 శాతం కన్నా తక్కువ మంది అది వేసుకున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అటువంటి ప్రపంచ ప్రఖ్యాత ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా కోవాగ్జిన్ వేసుకోమని కరాఖండిగా చెప్పేస్తున్నారు. వైద్య సంఘం కూడా ఇదే విషయమై సమావేశం తీర్మానం చేసుకోవడం ఆశ్చర్యకరం. ఇలా చాలామంది కోవాగ్జిన్ వేసుకోవడానికి ఆలస్యమైనా సరే… కోవాగ్జిన్ మాత్రం వేసుకునేది లేదంటూ తెగేసి చెబుతుండడం విచిత్రం.