Corona Vaccine : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్నో నెలలు కష్టపడి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారతదేశంలో దాని సరఫరా కూడా జోరుగా సాగుతోంది. రోజుకి కొన్ని లక్షల మంది ఈ టీకాను వేయించుకున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంత మంది చనిపోవడం జరుగుతోంది తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో అంగనవాడి వర్క్ సుశీల మృతి ఒక ఉదాహరణ. వ్యాక్సిన్ వేయించుకున్న పది రోజుల తర్వాత సుశీల అనారోగ్యానికి గురి అయ్యింది.
ఈ నెల 23న ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు. వెంటనే అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో సుశీలను హైదరాబాద్ కు తరలించారు. అక్కడే నిమ్స్ లో చికిత్స తీసుకుంటూ ఆమె మరణించింది. అయితే వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించని హెల్త్ డైరెక్టర్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఆమె మృతికి అసలు వ్యాక్సిన్ కారణమే కాదు అని ఆయన తేల్చి చెప్పారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల హెల్త్ వర్కర్లు అనారోగ్యానికి గురి కావడమే కాకుండా కొందరు మరణించారు కూడా.
అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి మరణాలు సంభవించవు అని తేల్చి చెబుతున్నారు. ఇక వీరు చేసే పోస్టుమార్టం రిపోర్టులు…. వాటినన్నింటినీ బట్టి చూస్తే అసలు వారి మరణానికి వ్యాక్సిన్ కి ఎలాంటి సంబంధం లేదు అని తెలుస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంత మంది మరణించారు. లక్షలమందికి ఒకేరోజు టీకాలు వేస్తారు…. వారిలో ఒకరిద్దరు సాధారణ అస్వస్థత కు గురయి లేదా అప్పటికే తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వారు కూడా ఉంటారు. వారు మరణించినపుడు వ్యాక్సిన్ వల్లనే జరిగింది అని దుష్ప్రచారాలు అవుతుంటాయి.
అయితే బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత విచిత్రంగా అస్వస్థతకు గురి అయితే మాత్రం దానిని సీరియస్ గానే పరిగణించాలి. సుశీల విషయంలో ఏమి జరిగింది అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు అని చెప్పాలి. అయితే సుశీల వయస్సు 60 సంవత్సరాలు. ఆమెకు ఇప్పటికే కొన్ని అనారోగ్యాలతో బాధపడుతూ ఉంది అని అంటున్నారు. మొత్తానికి అయితే ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం వ్యాక్సిన్ చాలా సురక్షితం అని…. అనవసరమైన అపోహలు పెట్టుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. తమ తోటి నర్సులని, హెల్త్ కేర్ వర్కర్లను కూడా ప్రోత్సహిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?