ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి కరోనా వైరస్ కి చాలా దేశాలలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం జరిగింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో చాలా దేశాలు ఆర్ధికంగాఅదేవిధంగా ప్రాణనష్టం పరంగా భారీ స్థాయిలో ని మూల్యం చెల్లించు కున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాలలో ఈ వైరస్ వలన చాలామంది చనిపోవడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా ఈ వైరస్ నివారణకు సంబంధించి వస్తున్న వ్యాక్సిన్లు గురించి రకరకాల వార్తలు అంతర్జాతీయంగా వినబడుతున్నాయి. చాలాచోట్ల వ్యాక్సిన్ విఫలం కావడంతో ఆయా దేశాలలో వ్యాక్సిన్ తీసుకున్న మనుషులకు రియాక్ట్ గట్టిగానే తగలటం తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో తాజాగా మన దేశంలో కూడా కొద్ది రోజులలో వ్యాక్సిన్ ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో వ్యాక్సిన్ ట్రయిల్ రన్ లు కూడా జరుగుతున్నాయి.
అంత మాత్రమే కాక ఇప్పటికే దేశంలో రెండు వ్యాక్సిన్లకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఆక్స్ ఫర్డ్ భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ను తీసుకుంటే నపుంసకులుగా మారతారు అన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. ఈ వార్త విని చాలా మంది దేశంలో మగవాళ్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో అలాంటి వదంతులు నమ్మొద్దు అంటూ డీసీజీఐ వీజీ సొమానీ వెల్లడించారు. వ్యాక్సిన్లు 100% ప్రభావం చూపుతాయని తాము నిర్ణయానికి వచ్చిన తర్వాతే అనుమతులు ఇచ్చినట్లు మొదటిలో కొద్దిగా జ్వరం తల నొప్పి అలర్జీ వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని దానికి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదని సామాని భరోసా ఇచ్చారు.