లోకాన్ని, లోకులను వణికిస్తున్న కరోనాకి విరుగుడు కోసం 630 కోట్ల జనం వేచి చూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా బయటకు రావాలంటే, స్వేచ్ఛగా తిరగాలంటే భయపెడుతున్న కరోనాకి వాక్సిన్ కనిపెట్టాలని ప్రపంచ దేశాలు, శాస్తవ్రేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఏ ఏడాది మార్చి నుండి 12 సార్లు రకరకాల ప్రయోగాలు, ట్రయల్స్ జరిగాయి. కానీ వచ్చే నెలలో మాత్రం ఒక పెద్ద ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. అది గానీ సక్సెస్ అయితే కరోనాకి కళ్లెం పడినట్టే.
అగ్రరాజ్యం అమెరికాలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాను జులై నెలలో ట్రయల్స్ వేయనున్నారు. ఆ నెలలో దాదాపు 30 వేల మంది వలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఇందుకోసం అవసరమైన డోసులను సిద్ధం చేసినట్లు మోడెర్నా తెలిపింది. ఈ టీకా పరీక్షలను మోడెర్నా మార్చిలోనే ప్రారంభించింది. తొలుత 45 మంది వలంటీర్లపై ప్రయోగించింది. అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచా రం. వచ్చే నెల్లో భారీయెత్తున నిర్వహించే పరీక్షలతో టీకా అసలు సామర్థ్యం బయటపడే అవకాశముంది.
ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తే కరోనాకి పరిష్కారం దొరికినట్టే. పూర్తస్థాయిలో వాక్సిన్ లు తయారు చూస్తారు. ఒక వేళ అది సక్సెస్ అయి, అంతా అనుకున్నట్టు జరిగితే పది నెలల్లో 100 కోట్ల డోసులు అందించగలమని అమెరికాలోని ఫార్మా కంపెనీల స్పష్టం చేస్తున్నాయి. అమెరికా సహా ఇండియా, రష్యా, బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో కూడా ఫార్మా కంపెనీలు ముందుకి వస్తే వచ్చే జనవరి నాటికి కరోనాకి విరుగుడు రావచ్చు..