Corona Vaccine : ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సరిగ్గా స్పందించింది. ఇన్నాళ్లు కొన్ని దేశాలకే వత్తాసు పలుకుతూ ప్రపంచదేశాలకు తీరని నష్టం చేకూరుస్తున్నారు అన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఈ వ్యవస్థ ఇప్పుడు ధనిక దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్లను పేద దేశాలకు అందకుండా చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు ట్రెడోస్ ఫైర్ అయ్యారు.
అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ మందుల పంపిణీ కి సంబంధించిన విషయాన్ని కూడా అఫిషియల్ గా షేర్ చేయకుండా తమ స్వార్ధాల చూసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు అన్ని వ్యాక్సిన్లు ఉత్పత్తిచేసే కంపెనీలతో నేరుగా డీల్ కుదుర్చుకోవడం వల్ల పేద దేశాలకు అందాల్సిన కేటాయింపులు తగ్గిపోతున్నాయని అని విచారం వ్యక్తం చేశారు.
అత్యాధునిక వైద్య వసతులు, డాక్టర్లు సదుపాయాలు ఉన్న ధనిక దేశాలు ఇలా చేసి తమ స్వార్థం చూసుకుంటూ రాజకీయంగా తమ దేశ ప్రజలను రక్షన కల్పిస్తున్నాం అనే స్వార్థపూరితమైన స్వభావం వల్ల ప్రపంచం చాలా నష్టపోతోంది ట్రెడోస్ విచారం వ్యక్తం చేశాడు. అలాగే పేద దేశానికి వ్యాక్సిన్లు కావాలంటే నిధులు అవసరం. అయితే అమెరికా యూరోపియన్ యూనియన్ జర్మనీ దేశాలలో ఆర్థికంగా తోడ్పతున్నప్పటికీ పేద దేశాలకు వ్యాక్సిన్లు అందుబాటులో లేవని…. నిధులు ఉండి కూడా వృధా అని అన్నారు.
ఆయా దేశాలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ‘కోవాక్స్’ – కోవిడ్ వ్యాక్సిన్ రూపొందించే ప్రక్రియ కూడా నీరుగారిపోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం పైనే పేద దేశాలు ఆధారపడి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిధులు ఉన్నంత మాత్రాన ఇష్టప్రకారం వ్యాక్సిన్లు కొనుగోలు చేయకూడదని…. డబ్బులు ఉన్నంత మాత్రాన అన్నీ ఉన్నట్లు కాదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అయితే తమకు అవసరమైన వాటి కన్నా 1.25 బిలియన్ డోసు లను సేకరించాయని వన్ కాంపెయిన్ కో-ఫౌండర్ సింగర్ కూడా అయినా బోనో అన్నారు.