Corona Vaccine : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వాక్సిన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే సమయంలో భారత్ వివిధ దేశాలకు కూడా కరోనా వాక్సిన్ను – Corona Vaccine సరఫరా చేస్తోంది. అంతేకాకుండా త్వరలోనే దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలకి కూడా కరోనా వాక్సిన్ ను అందించే ప్రక్రియను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రజలకు వాక్సిన్ అందించే ముందే కరోనా టీకా బహిరంగా మార్కెట్లోకి వచ్చేస్తుందని అలాగే దాని రేటు ఎక్కవ ఉన్నప్పటికీ దాన్ని కొని వేసుకుందామని అధిక సంఖ్యలో ప్రజలు ఎదురు చుస్తున్నట్లు సమాచారం. అటువంటి వారందరికీ కేంద్రం ఇటీవల షాక్ ఇచ్చింది.
మొదటిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం మాత్రమే కరోనా టెస్టులను అధికారికంగా నిర్వహించింది. ఆ తర్వాత బయట కొన్ని ల్యాబ్స్ ను గుర్తించి వాటికి కరోనా టెస్టులు చెయ్యడానికి అనుమతి ఇచ్చారు. ఆ తరువాత ఇక అనుమతులతో పనిలేకుండా అన్నీ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా టెస్టులు చెయ్యడం ప్రారంబించారు. అయితే, ఇలాగే కరోనా వాక్సిన్ కూడా బయట మార్కెట్ లలోకి వస్తున్నదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇటీవల ఆ ఊహలు అన్నిటికి చెక్ పెడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషన్ స్పందించారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను బహిరంగా మార్కెట్లో కరోనా టీకా ను విడుదల చెయ్యదని ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ’ప్రస్తుతానికి భారత్ ప్రభుత్వం ఇండియా లో రెండు రకాల టీకాలను ప్రజల అందించడానికి అనుమతించింది. ప్రభత్వానికి వీటిని బహిరంగంగా మార్కెట్లలోకి తీసుకొచ్చే ఆలోచన లేదు. DCGI నుంచి అనుమతి వచ్చే వరకు కరోనా టీకాను బహిరంగ మార్కెట్లలోకి విడుదల అవ్వనివ్వము. ప్రస్తుతానికి మేము ఏమి ఫలానా సమయంలోగా కరోనా వాక్సిన్ ను బహిరంగ మార్కెట్లలోకి తీసుకురావాలని నిర్ణయించుకోలేదు‘ అని భూషన్ ప్రకటించారు.