భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5,67,636కి చేరుకుంది. మరణాల సంఖ్య 16,904కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,35,271. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,15,301 గా ఉంది.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 15,394 కు చేరింది. నిన్న ఒక్కరోజే ఆరుగురు కరనాతో మృతి చెందడంతో వారి సంఖ్య 253కు చేరింది. 410 మంది మంది కోలుకోగా.. 5,582 మంది డిశ్చార్జి అయ్యారు.
ఏపీలో కూడా కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారితో 706 మంది స్థానికులు.. ఇతర రాష్ట్రాల వారు 81మంది ఉన్నారు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య 13,891కి చేరుకుంది.