Corona Virus : ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి ఆర్థికంగా ఎంతో నష్టం చేకూర్చిన కరోనా వైరస్ Corona Virus కి విరుగుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ అక్కడ అక్కడ జరుగుతున్న సంఘటనలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన దేశం రష్యా. ఆ తర్వాత చాలా దేశాలలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం జరిగింది. అయితే ప్రపంచంలో అన్ని దేశాలలో కంటే ఇండియాలో అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇవ్వటంతో ప్రపంచంలో ధనిక దేశాలు గా పిలవబడే దేశాలు భారీ స్థాయిలో ఆర్డర్లు పెడుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో వ్యాక్సిన్ వేసుకున్న వారు కొంత మంది మొదటిలో అనేక ఎలర్జీలకు అదేవిధంగా అనారోగ్యానికి గురి కావడం జరగగా ఇటీవల ఇద్దరు మరణించడం తో ఈ వార్త కలకలం రేపుతోంది. మేటర్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా వ్యాక్సిన్ వేసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు ఆర్ కృష్ణయ్య (49) ఇటీవల మరణించడం జరిగింది.
మంగళవారం వ్యాక్సిన్ వేయించుకోవాలి తరువాత అరగంటసేపు అతడికి ఎటువంటి అనారోగ్యం కాలేదు తర్వాత గడచిన 24 గంటల్లో అతనికి అనారోగ్యం రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు అతడిని తిరుపతిలో రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వేయించుకుని ఓ అంగన్ వాడీ టీచర్ మరణించడం జరిగింది. దీంతో మృతుల కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ వికటించడంతో నే మరణించినట్లు ఆరోపిస్తున్నారు. అంతకు ముందు కూడా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలలో భయాందోళనలు మొదలవుతున్నాయి. ఇప్పటివరకు ఫ్రంట్ లైన్ లో కరోనా వచ్చిన క్రమంలో పనిచేసిన వారికి పంపిణీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలనుసారం రాష్ట్రాలలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో ఇటువంటి దుష్ఫలితాలు రావటంతో చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి అసలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.