కరోనా, లాక్ డౌన్ పరిస్థితులకు వ్యవస్థలన్నీ నిలిచిపోయాయి. ఇందులో ఎంటర్ టైన్మెంట్ రంగం కూడా ఉంది. సినీ, టీవీ పరిశ్రమల్లో షూటింగ్స్ నిలిచిపోయాయి. కార్మికులకు ఉపాధి పోయింది. ప్రేక్షకులు కూడా కొత్త ఎంటర్ టైన్మెంట్ మిస్సయ్యారు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో గత నెలలో షూటింగ్స్ కు ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ వచ్చాయి. కొన్ని సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటే.. మరికొన్ని సీరియల్స్, ఎంటర్ టైన్మెంట్ షోలు షూటింగ్ జరుపుకున్నాయి.
j
కానీ.. ఇప్పుడు కరోనా మరీ తీవ్రమవడంతో షూటింగ్స్ లో పాల్గొన్న నటీనటులకు వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి. దీంతో కొన్ని సీరియల్స్ షూటింగ్స్ ఆపేశారు. షూటింగ్స్ కోసం పర్మిషన్స్ తెచ్చుకున్న సినిమా పరిశ్రమ కూడా షూటింగ్స్ కు భయపడిపోతోంది. ఎవరూ ఇళ్లు వదిలి రావడం లేదు. ఈ నేపథ్యంలో టెలివిజన్ షోస్ కూడా షూటింగ్స్ ఆపేసే పరిస్థితులు నెలకొన్నాయని వార్తలు వస్తున్నయి. ఇందులో భాగంగా టెలివిజన్ టాప్ సెలబ్రిటీలు అనసూయ, సుమ కూడా షూటింగ్స్ కు దూరంగా ఉండాలని భివిస్తున్నారని టాక్.
ప్రస్తుతం జబర్దస్త్ ప్రోగ్రామ్ షూటింగ్ లో మాత్రమే అనసూయ పాల్గొంటోందని అంటున్నారు. సుమ కూడా రియాల్టీ షోస్ కు దూరంగా ఉంటుందని అంటున్నారు. కరోనా వైరస్ మరీ తీవ్రం కావడంతో అందరిలో భయం కలుగుతోంది. ఈ టైమ్ లో రిస్క్ వేస్ట్ అనే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. అందుకే కొన్ని ఫేమస్ షోస్, సీరియల్స్ మళ్లీ షూటింగ్స్ నిలిచిపోయే అవకాశం ఉందంటున్నారు.