దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రజలే స్వఛ్చందంగా జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ.. రోజువారీ కరోనా కేసుల లెక్కలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో గత నాలుగైదు రోజులుగా కరోనా కేసులు 4 నుంచి 5 వేలు దాటిపోతున్నాయి. ఇది కలవరపెట్టే విషయమే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్రంలో ఉన్న ఓ కీలక నేతకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందనే విషయం ఇప్పుడు కేంద్రంలో కలవర పెడుతోందని వార్తలు వస్తున్నాయి.
ఏపీ, తెలంగాణకు చెందిన ఆ కీలక నాయకుడు కేంద్రంలో కీలక స్థానంలో ఉన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధిగా ఆయన వ్యవహారాలు చక్కదిద్దూతూ ఉంటారు. ప్రస్తతం ఆయనకు కరోనా సోకినట్టు మీడియా వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎక్కడా అధికారిక సమాచారం లేకపోయినా ప్రస్తుతం ఈ వార్త కేంద్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దీనిపై కేంద్రం నుంచి కానీ ఆ ముఖ్య నేత నుంచి గానీ ఎటువంటి స్పందనా లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.