ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా అని ప్రతి ఒక్కరికి తెలుసు. చైనా దేశం కావాలని ప్రపంచ దేశాల పై కరోనా వైరస్ దురుద్దేశంతో రిలీజ్ చేసిందని యూరప్ మరియు అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పటినుండో ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల చైనా ప్రభుత్వం చైనా దేశంలో కరోనా వైరస్ మొదటి పాజిటివ్ కేసు గత ఏడాది డిసెంబర్ చివరిలో నమోదయిందని అప్పటి నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ని ప్రపంచ దేశాలను అలర్ట్ చేయాలని హెచ్చరించినట్లు శ్వేత పత్రం విడుదల చేసింది.
చైనా విడుదల చేసిన శ్వేత పత్రం పై పాశ్చాత్య దేశాలు చైనా చెబుతోంది అబద్ధమని చైనా దేశంలో కరోనా వైరస్ ముందు నుండే ఉందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా దేశానికి చెందిన ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ అధ్యయనం సంచలనం సృష్టిస్తోంది. గత ఏడాది ఆగస్టులోనే కరోనా బయటపడిందా అనే కొత్త సందేహాలను లేవనెత్తుతోంది. డిసెంబర్ నెల కంటే ముందే చైనా దేశంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ లో రోగుల రద్దీ పెరిగిందని యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది.
అంతేకాకుండా వుహాన్ ఆస్పత్తుల్లోని పార్కింగ్ స్థలాల్లో పెరిగిన వాహనాల రద్దీ ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు హార్వర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వచ్చారు. అయితే ఈ విషయంలో కరోనా కారణంగా హాస్పిటల్స్ వద్ద రద్దీ అయ్యిందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. మరోపక్క చైనా దేశం హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన అధ్యాయాన్ని కొట్టిపారేసింది. కానీ యూరప్ దేశాల నాయకులు హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం కరెక్ట్ అని అవే ప్రూఫ్స్ అని నిర్ధారిస్తున్నారు.