ప్రపంచాన్ని విపరీతంగా వణికించిన కరోనా వైరస్ పలు దేశాల కి చుక్కలు చూపించింది. అగ్రరాజ్య అమెరికా అయితే చిగురుటాకులా వణికిపోయింది. అయితే అమెరికాలో ఇండియాలో కంటే ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయినా వారి దేశంలో మరణాల మాత్రం జోరు తగ్గని పరిస్థితి. దీంతో మనదేశంలో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దీనివల్ల పెద్దగా లాభం ఉండదేమో అని అందరూ అనుకుంటూ ఉన్నారు.
అయితే భారత దేశం మాత్రం మహమ్మారిపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే పరిస్థితి వచ్చేసినట్లు గణాంకాలు చూస్తే మనకి అర్థం అవుతుంది. అసలు వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా కేసులు నమోదు తగ్గుముఖం పట్టడం గమనార్హం. వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోంది. పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఒకేరోజు 90 వేలకు పైగా కేసులు నమోదైన ఈ దేశంలో మరికొద్ది రోజుల్లో లక్ష కేసులు నమోదు అవుతాయని అని భయం ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో ఒక్కసారిగా కేసులు నమోదు అంతకంతకూ తగ్గుముఖం పట్టింది.
మరణాల విషయంలో కూడా అంతే…. ఆరు నెలల క్రితం రోజుకి కనీసం రెండు వేల మంది చనిపోయేవారు. డిసెంబర్ మొదటి వరకు కూడా అటూఇటుగా లెక్క అంతే ఉండేది. అయితే ఇప్పుడు రోజుకు 200 కంటే తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. అంటే 90% పరిస్థితి మెరుగుపడినట్లే. ఇప్పుడు ఆ రెండు వందల మరణాలు కూడా సంభవించడంలేదు
కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య కూడా బాగా తక్కువగా నమోదు అవుతోంది. మొత్తం కేసుల్లో మరణాల రేటు 1.4% గా ఉంది. అంతేకాకుండా భారతదేశంలోనే అత్యధికంగా రికవరీ రేటు ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం 96.82% శాతం రికవరీ రేటు భారత దేశం సొంతం. ఇక వ్యాక్సినేషన్ జోరు అందుకంటే ఈ లెక్కలు మరింత మెరుగు పడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?