ఇండియాలో కరోనా వైరస్ డేంజరస్ స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఉన్న కొద్దీ పాజిటివ్ కేసులు బయటపడటంతో రోజురోజుకి పెరుగుతుండటంతో జనాలలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా కేంద్రం తాజాగా మరికొన్ని లక్షణాలను కరోనా లక్షణాలుగా పేర్కొంది. మొదటిలో జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, కళ్లు ఎర్రబారడం, అలసట, శ్వాస తీసుకోలేకపోవడం, గొంతునొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కరోనా లక్షణాలుగా గుర్తించడం మనకందరికీ తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా వీటికి అదనంగా కేంద్రం మరికొన్ని లక్షణాలను కూడా జాబితాలో చేర్చింది. ఉన్నట్టుండి వాసన, రుచి చూసే శక్తి కోల్పోవడాన్ని కూడా ఓ లక్షణంగా చేర్చారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ప్రత్యేకమైన డాక్యుమెంట్ ప్రచురించింది. దానిలో ఈ కొత్త లక్షణం కరోనా లక్షణంగా గుర్తించడం జరిగింది. దేశంలో ఉన్న అన్ని వైద్య నిపుణుల సందేహ నివృత్తి కోసం కేంద్రం ఈ డాక్యుమెంట్ రూపొందించడం జరిగింది.
వాసనలు గుర్తించడంలో విఫలం కావడం, రుచిని తెలుసుకోలేకపోవడం కూడా కరోనా వైరస్ కారణంగా కలిగే వ్యాధి లక్షణాలు కావొచ్చని కేంద్రం అభిప్రాయపడింది. అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ లో కరోనా వ్యక్తి నుంచి మరోవ్యక్తికి నేరుగా ఎలా సోకుతుందో కూడా వివరించడం జరిగింది. దీంతో తాజాగా కొత్త లక్షణం తో మనం అన్నం తినే సమయంలో కూర వాసన రాకపోయినా కరోనా అనేవిధంగా భయపడే పరిస్థితి నెలకొందని తాజాగా ఈ కొత్త లక్షణం వార్త విని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.