అవును.. మీరు చదివిన టైటిల్ కరెక్టే. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే… మలేషియా సైంటిస్టులు మరో బాంబు పేల్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా కంటే పది రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపించే మరో కొత్త రకం వైరస్ ను గుర్తించినట్టు వెల్లడించారు.
అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు.. కరోనా వైరస్ కొత్త రూపం. ఆ కొత్త రకం కరోనా వైరస్ పేరు డీ614జీ. ఈ వైరస్ ను మొదటగా భారత్ నుంచి మలేషియాకు తిరిగి వెళ్లిన ఓ వ్యక్తిలో గుర్తించారు.
ఆ వ్యక్తి అప్పటికే మరో 45 మందికి కరోనా వ్యాప్తి చేయగా.. అందులో ముగ్గురికి మాత్రం ఈ కొత్త రకం కరోనా వైరస్ డీ614జీ వచ్చినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఈ కొత్త రకం కరోనా వైరస్ మలేషియాతో పాటు అమెరికా, ఐరోపా దేశాల్లోనూ విస్తరించిందట. అంటే.. ఒకవేళ ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కరోనా వైరస్ ను కట్టడి చేయగలిగినా.. దాని నుంచి ఉత్పన్నమైన దాని బిడ్డ డీ614జీని మరోసారి ప్రపంచమంతా ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని సైంటిస్టులు చెబుతున్నారు.
ఒకవేళ అదే కనుక జరిగితే.. కరోనా కంటే ఎక్కువ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కరోనా కన్నా ఈ వైరస్ అతి ప్రమాదకరమైనది. దాని కన్నా 10 రెట్లు ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
ఒకవేళ కరోనాకు టీకాను తీసుకొచ్చినా.. ఆ టీకా ఈ కొత్త రకం వైరస్ మీద పనిచేయదు. మళ్లీ ఈ కొత్త రకం వైరస్ కోసం వ్యాక్సిన్ ను ప్రత్యేకంగా తయారు చేయాల్సిందే.
అయితే.. ఇందులో మరో మతలబు కూడా ఉంది. ఈ కొత్త వైరస్ కరోనా నుంచి మ్యుటేషన్ అయింది. అంటే ఉత్పరివర్తన చెందింది. నిజానికి ఇది కరోనా కన్నా 10 రెట్లు ప్రమాదకరమైనది అయినప్పటికీ.. కొన్ని రోజుల వరకే ఈ వైరస్ బతికి ఉంటుందట. ఆ తర్వాత ఇది బలహీనపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ.. అది బలహీనపడేలోపు ఎంతమంది ఈ వైరస్ బారిన పడతారో అని సైంటిస్టులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.