ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1,23,87,420 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,57,395 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న 71,87,389 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటికి 46,42,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా 26,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,802కు చేరుకుంది. గత 24 గంటల్లో 475 కరోనా మరణాలు సంభవించాయి. మొత్తంగా ఇప్పటివరకూ కోవిడ్ మరణాల సంఖ్య 21,604కు చేరుకుంది. ఇప్పటివరకూ 4,95,513 మంది కోలుకోగా ఇంకా 2,76,685 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1555 పాజిటివ్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్కరోజులో ఈస్థాయిలో ఏపీలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 1500 కాగా.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 53, విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది.
తెలంగాణలో గత 24గంటల్లో 1410 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 918 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 7గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 331కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకూ 30,946 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.