ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కబళించేస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 1,36,81,783 కరోనా కేసులు నమోదయ్యాయి. 5,86,136 మంది కరోనాతో మృతి చెందారు. అమెరికాలో 36,15,991 కరోనా కేసులు నమోదవగా 1,40,105 మంది మృతి చెందారు. బ్రెజిల్లో 19,70,909 కరోనా కేసులకు 75,523 మంది మృతి చెందారు. రష్యాలో 7,46,369 పాజిటివ్ కేసులకు 11,770 మంది మృతి చెందారు.
భారత్ లో కరోనా కేసులు 9.68 లక్షలు దాటాయి. ఇప్పటివరకు 24,912 మంది మృతి చెందారు. కరోనా నుంచి 6.13 లక్షల మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు 2.75 లక్షలు దాటాయి. మొత్తం 10,928 మంది మృతి చెందారు. తమిళనాడులో 1.51 లక్షలు నమోదవగా 2,167 మంది మృతి చెందారు. ఢిల్లీలో 1.16 లక్షల కేసులు నమోదవగా 3,847 మంది మృతి చెందారు.
ఏపీలో ఒక్కరోజే 2432 కేసులు నమోదయ్యాయి. మరో 44 మంది మృతి చెందగా ఆ సంఖ్య 452కి చేరింది. కరోనాతో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 16,621గా ఉంది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 18,378 మంది డొశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య 35,451కి చేరింది.
తెలంగాణలో గడచిన 24 గంటలోల 1597 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 39,342కు చేరుకుంది.