తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయం కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో 983, ఏపీలో 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 14,419కు చేరుకోగా.. ఏపీలో 13,098కి చేరుకుంది. నిన్న తెలంగాణలో 4, ఏపీలో కోవిడ్ తో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఏపీలో నమోదైన 169 మరణాల్లో 116 కృష్ణా, కర్నూలు పరిధిలోనే ఉండటం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. హైదరాబాద్ లో కోవిడ్ ఉధృతం కావడంతో నేడు కేంద్ర బృందం పర్యటించనుంది. కంటోన్మెంట్ క్లస్టర్లు, గాంధీ, టిమ్స్ ఆస్పత్రులను సందర్శించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశం కానున్నారు.