Coronavirus : కరోనా మళ్ళీ విజృంభిస్తున్న వేళ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం సరుకులు కొనేందుకు కిరాణా షాప్ కి కాని సూపర్ మార్కెట్ కాని వెళ్లినపుడుతప్పనిసరిగా జాగ్రత్తలు పాటించవలిసిన నియమాలు తెలుసుకుందాం. సరుకులు కొనడానికి వచ్చిన వారు ప్యాకింగ్ చేసి ట్రేలలో ఉంచిన వాటిని చూసేందుకు చేతితో తీసి పెడుతుంటారు.
మనం కూడా అదే వస్తువులు తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకోవలిసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం వేళ కాస్త ముందుగానే సరుకులు కొనేందుకు వెళ్లి పని ముగించుకుని రావడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో తక్కువ మంది వస్తుండడం వలన సరుకులు తొందరగా కొని బయటకు రావచ్చు. బయటకు వెళ్లే ప్రతిసారి హ్యాండ్ వెంట తీసుకెళ్లం మంచిది. స్టోర్లో శానిటైజర్నున్నప్పుడు కూడా మిగతా కస్టమర్లకు ఆరడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి .
చాలా మంది మాస్క్ నోటికి మాత్రమే ఉంచుకుంటున్నారు.. అలా కాకుండా నోరు, ముక్కు రెండు కవర్ అయ్యేలా మాస్క్ ను పెట్టుకోవాలి . షాప్ లో ఉన్నంత సేపు కళ్లు, ముక్కు, నోరు ముఖాన్ని అసలు తాకవద్దు. సాధ్యమైనంతవరకు డైరెక్టుగా డబ్బు ఇవ్వడం తీసుకోవడం కాకుండా కార్డు, తో లేదా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించేలా చూసుకోవాలి. ఆ తరువాత శానిటైజర్తో చేతుల్ని శుభ్రం చేసుకోవడం మంచిది. ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు పప్పులు, కూరగాయలు, ఇతర వస్తువులు ఆన్లైన్లో తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి.
డెలివరీ సమయంలో కూడా ఫోన్పే, గూగుల్పే వంటి విధానంలో డబ్బు చెల్లించే పద్ధతి పెట్టుకోండి.
డెలివరి బాయ్ తెచ్చిన వస్తువులను నేరుగా తీసుకోకుండా ఇంటి ముందు పెట్టి వెళ్ళమని చెప్పి పార్సిళ్లు దూరంగా ఉండి తీసుకుంటే మంచిది. తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్ళకండి . అది కూడామాస్క్ ,శానిటైజర్ వెంటవుంచుకుని తీరాలి.