తాజాగా కరోనా వైరస్ లో మరో కొత్త రకాన్ని నిపుణులు ఆఫ్రికాలో గుర్తించారు. ఇప్పుడు కరోనా వైరస్ కొత్తగా రూపు మార్చుకొని ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆఫ్రికా దేశంలో పుట్టుకొచ్చిన ఈ కొత్త కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ఇటీవల ఆఫ్రికాలోని నైజీరియాలో మరో రకం కరోనా వైరస్ ను గుర్తించారు. కరోనా వైరస్ మరోసారి అంతుచిక్కకుండా ప్రపంచ దేశాలను భయపెడుతుంది.
ఇటీవల వందలాదిగా బ్రిటన్ మరియు దక్షిణాఫ్రికాల్లో కొత్త రకం కేసులు నమోదయ్యాయి. అక్కడ 70 శాతం కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వైరస్ పై స్పష్టత రావడానికి దీనిపై లోతైన పరిశోధనలు చేయాల్సి ఉందని అక్కడి అధికారులు చెడుతున్నారు.
నైజీరియా లో బయటపడిన కరోనా వైరస్ గురించి దక్షిణాఫ్రికా సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెడ్ జాన్ కెంగాసాంగ్ స్పందించారు. అడిస్ అబాబా నుంచి ఆన్లైన్ న్యూస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ యూకే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన దానికంటే ఈ వైరస్ డేంజర్ గా ఉందని తెలిపారు. ప్రస్తుతం నైజీరియా లో ఉన్న వైరస్ 501 మ్యుటేషన్ చెందిన రకమని ఆయన స్పష్టం చేశారు.
ఇంతక ముందు ఉన్న కరోనా వైరస్ పై జన్యుమార్పిడి జరిగిందని నైజీరియా శాస్త్రవేత్తలు తెలిపారు. నైజీరియా లోని రోగుల్లో టెస్ట్ చేయగా ఈ వైరస్ కొత్తగా రూపు మారిందని తెలిసిందట. డిసెంబరు 18 వ తేదీన దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ను 501.వీ2గా పేర్కొన్నారు.
ఆఫ్రికాలో మొత్తం 200 మిలియన్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. కరోనా మొదలైనప్పటి నుంచి బుధవారం నాటికి పాజిటివ్ కేసులు 80,000 నమోదయ్యాయి. కానీ డిసెంబరులో మొదటిసారి రోజుకి కేసులు 1,000కి నమోదు అవుతున్నాయి.