Coronavirus: కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో ఎవరికీ అర్థం కాని రీతిలో పుంజుకుంటోంది. ఈ వైరస్ ఇప్పటికే వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అసలు ఏ వస్తువుని ముట్టుకుంటే ఇది సోకుతుందో… ఎక్కడ జనాల మధ్యకు వెళితే ఇది పాకుతుందో అని ప్రజలంతా హడలెత్తిపోతున్నారు.
అయితే ఇలాంటి సమయంలోనే ఏకంగా కరోనా వైరస్ జన్యువులు నీటిలో నిల్వ ఉన్నాయన్న వార్త ఇప్పుడు అందరిని మరింత ఆందోళన లోకి నెట్టేస్తోంది. హైదరాబాద్ మహానగరానికి నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ లో ఈ కోవిడ్ ఆనవాళ్లు ఉన్నట్లు అధ్యయనాల్లో బయటపడింది. హుస్సేన్సాగర్ లోనే కాదు నాచారం పెద్ద చెరువు, తుర్క చెరువు లో కూడా ఈ వైరస్ జన్యువులుఉన్నాయట.
ఇక ఈ అధ్యయనాలు నిర్వహించింది ఏవో చిన్నాచితకా సంస్థలు అయితే కావు. ఐఐసిటి, సిసిఎంబి, ఐసిఐఆర్ వంటి సంస్థలు వీటిని సంయుక్తంగా నిర్వహించినట్లు సమాచారం. వారు గత ఏడు నెలలుగా ఇలా జలాశయాల్లో నమూనాలను సేకరిస్తూ వాటిపై అనేక పరిశోధనలు సాగించారు.
అయితే ఇక్కడ అందరూ ఊపిరి పీల్చుకునే విషయం ఏమిటంటే ఈ కోవిడ్ వైరస్ జన్యువుల వల్ల ప్రజలకు ఇన్ఫెక్షన్ సోకదని వారు తేల్చి చెబుతున్నారు. నీటిలో కలిసి ఉన్నప్పటికీ వీటి ద్వారా వైరస్ తీవ్రంగా విస్తరించదని నిర్ధారించారు. ఇవి కేవలం కరోనా బాధితుల విసర్జనల ద్వారా జలాశయాల్లో కి జన్యు పదార్థాల రూపంలో వచ్చి ఉంటాయని నిపుణులు అంటున్నారు కాబట్టి నుండి వైరస్ మనుషులకు వ్యాపించే అవకాశం లేదని వారు స్పష్టంగా తెలియజేసినట్లు అయింది.
అంతేకాకుండా ఇప్పటివరకు ఈ నీటి ద్వారా ఎవరికైనా కోవిడ్ సోకిన ఆధారాలు కూడా లేవు అని చెప్పేశారు. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు