Coronavirus: కరోనా ప్రపంచాన్ని ఎలా వణికించిందో మనం చూసాం. ఒక్కో దేశం ఆర్ధిక వ్యవస్థ పది సంవత్సరాల వెనుకకి వెళ్లిపోయింది. అగ్ర రాజ్యం అయిన అమెరికా హడలిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా నష్టం నుంచి కోలుకుంటున్నారు. కరోనా కి వాక్సిన్ వచ్చిందని తెలిసాకే ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మొదటి నుంచి నిపుణులు, డాక్టర్లు మాస్క్ మరియు సామజిక దూరం తప్పనిసరి అని హెచ్చరిస్తూనే ఉన్నప్పటికీ వాక్సిన్ వచ్చింది అన్న ధైర్యంతో ప్రజలు కరోనా నిబంధనలను గాలికి వదిలేసారు.
ఇపుడు ఆ నిర్లక్ష్యమే ఇపుడు మళ్ళి కరోనా విజృభించడానికి కారణం అయ్యింది. తాజాగా నిన్న ఒక్క రోజే ఇండియాలో 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం నోమోదయ్యిన కేసుల సంఖ్య 1.10 కోట్లకు చేరింది. అంతేకాకుండా నిన్న ఒక్క రోజే కరోనా సోకడం వలన దాదాపు 83 మంది మరణించారు. వీటితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 1.56 లక్షలు లకు చేరుకుంది. ఇండియా లో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 1,50,055 కి చేరుకుంది.
ఇదిలా ఉండగా మహారాష్ట్రలో నిన్నటి రోజున యాక్టివ్ కరోనా కేసులు 4519 గా నమోదయ్యింది. అలాగే పంజాబ్ లో 136 కేసులు, కర్ణాటకలో 58 కేసులు, మధ్యప్రదేశ్ లో 57 కేసులు, ఢిల్లీ లో 46 కేసులు, హర్యానా లో 45 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నందున కేంద్ర ప్రభుత్వం ప్రజలను కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే ఇదే విధంగా కేసులు పెరిగితే త్వరలోనే మళ్ళి దేశంలో లాక్ డౌన్ ఉండవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.