Coronavirus: ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ లో ఎంత మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ముఖ్యంగా చిరువ్యాపారులు, రోజువారి కూలీలకి ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్లడానికి కష్టం అవుతోంది ఇలా ఎంతో మంది ఆర్థికంగా పెద్ద ఎత్తున కరోనా వైరస్ దెబ్బక్కి అల్లాడిపోయారు.
అయితే లక్షలాది సంస్థలకు కష్టాలను తెచ్చి పెట్టిన కరోనా ప్రపంచంలో కొంతమందిని కుబేరులని కూడా చేసింది. ఒకరికి ఈ మహమ్మారి కష్టం గా మారితే మరొకరికి సంపదగా మారింది. కరోనాకి చెక్ పెట్టే వ్యాక్సిన్ల తయారీదారులకి లాభాల పంట పండుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ పెట్టిన కంపెనీలు తాజాగా ఈ జాబితాలో చేరడం గమనార్హం. టీకాలు తీసుకుని వచ్చిన లాభాలతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న మిలియనీర్లు కాదు బిలియనీర్ల లిస్టు లో కొత్తగా మరో తొమ్మిది మంది చేరినట్లు ‘ది పీపుల్స్ వ్యాక్సిన్‘ అనే సంస్థ ప్రకటించింది.
ఈ తొమ్మిది మందికి కలిపి ఏడాది ఆదాయం 19.3 బిలియన్ డాలర్లు అని లిస్ట్ కూడా పేర్కొంది. అలాగే ఈ బిలియనీర్ల జాబితాలో ఉన్న మరొక 8 మంది ఆదాయం వ్యాక్సిన్ తయారీ తరువాత తరువాత 32.2 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు తెలిపింది.
ఇక మరొక విస్మయపరిచే విషయం ఏమిటంటే… కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరిన వారు అందరి దగ్గర ఉన్న సంపదతో తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోని ప్రజలందరికీ 1.3 రెట్ల వ్యాక్సిన్లను అందించవచ్చని అంచనాలు కూడా తెలియజేశారు. కాబట్టి ఇలా లాభాల వెంట పడటం మానేసి తక్కువ ఆదాయం తక్కువ ఉన్న దేశాలపై దృష్టి పెడితే ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు అన్న భావన అందరిలో నెలకొంది.
కానీ కార్పొరేట్ కంపెనీలకు కాసుల వర్షమే కావాలి కానీ కటిక కష్టాల గోడు పట్టించుకుంటారా అన్నదే ప్రశ్న..!