పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు తో పోలిస్తే నిన్నమొన్నటి వరకు కరోనా పాజిటివు కేసులు తక్కువగా నమోదైన తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు సర్కార్ కెసిఆర్ సర్కార్ పసిగట్టింది .ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో బాధితుల కేసులు తక్కువగా నమోదవడానికి పరీక్షలు తక్కువగా నిర్వహించటం వంటి ఇతరత్రా కారణాలు ఉన్నాయి.
ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు సేఫ్ జోన్గా ఉన్న తెలంగాణ త్వరలో డేంజర్ జోన్గా మారే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉంది.జూలై నెల చివరి నాటికి తెలంగాణలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవడంతో పాటు అవి అరవై వేల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదన్న సమాచారం అందుకున్న కెసిఆర్ ప్రభుత్వం అప్రమత్తమైంది.దీంతో భవిష్యత్తును ముందుగా అంచనా వేయడంతో పాటు ఈ పరిస్థితి తలెత్తితే ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను,చేయవలసిన ఏర్పాట్లను కూడా కెసిఆర్ ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటోంది.
ముందస్తు ఏర్పాట్లు !
ఏకకాలంలో యాభై వేల మందికి కరోనా వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందుల నిల్వలను కెసిఆర్ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.వంద రోజుల పాటు కరోనా రోగులకు ఇవ్వడానికి అవసరమైన మందులను తెప్పించుకుంటోంది.కరోనా పాజిటీవ్ రోగులకు వారి వారి శారీరక స్థితిని గతంలో ఉన్న వ్యాధులను బట్టి యాభై నాలుగు రకాల మందులు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసి ఆ మందుల న్నిటినీ సిద్ధం చేస్తోంది.అలాగే కరోనా పాజిటివ్ కేసులు కేసులు ఎక్కువగా నమోదైన పక్షంలో ఆక్సిజను కి కొరత రాకుండా పధ్నాలుగు మంది సరఫరాదారులతో ఆక్సిజను సరఫరా కి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఉన్నత స్థాయి అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.మొత్తం మీద కరోనాపై యుద్ధానికి కెసిఆర్ సిద్ధమైపోయారు.ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవటానికి ఆయన ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.