ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మైనింగ్పై సిబిఐతో విచారణ జరిపించాలని మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు.
దేశంలో 350 కి పైగా ఇనుప ఖనిజ గనుల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని శర్మ పిటిషన్లో పేర్కొన్నారు. గనుల కేటయింపుల్లో ఆరు లక్ష కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందన్నారు.
2014 లో వివిధ సంస్థలకు ఇచ్చిన గనుల కేటాయింపులను రద్దు చేయాలని శర్మ సుప్రీం కోర్టుకు విన్నవించారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు సిబిఐకి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.