Biryani: మన దేశంలో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎక్కువ మంది ఇష్టపడే ఆహారాలలో బిర్యానీ కూడా ఒకటి. కొందరైతే వారానికి ఒకసారి అయినా బిర్యానీ తినాలని చూస్తారు. బిర్యానీలో ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ చాలా ఫేమస్. ఎవరైనా కొత్తవారు హైదరాబాద్ కి వస్తే ఖచ్చితంగా హైదరాబాద్ బిర్యానీ రుచి చూశారు. దేశవ్యాప్తంగా బిర్యానికి అంత పాపులారిటీ ఉంది. మనదేశంలో సాధారణంగా ప్లేట్ బిర్యానీ ఖరీదు ఇంచుమించు రూ. 150 ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఈ బిర్యానీ ఖరీదు వెయ్యి రూపాయలు వరకు ఉంటుంది. కానీ దుబాయిలో దొరికి ఈ బిర్యానీ ఖరీదు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ ప్లేటు బిర్యాని ఖరీదు తెలిస్తే నోరెళ్లబెడతారు…
దుబాయిలో ఓ భారతీయ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారంట్ పేరు బాంబే బరో. ఈ రెస్టారెంట్ లో ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ పేరుతో ఓ బిర్యానీని అందుబాటులో ఉంచారు. ఇది ఒక స్పెషల్ బిర్యానీ. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే ప్లేటు బిర్యాని ధర 1000 దిర్హామ్ లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.20వేలు అనమాట.
ఇంతకీ ఈ బిర్యానీ ఖరీదు రూ. 20 వేలు ఉండడానికి కారణం ఏమిటని ఆలోచిస్తున్నారా? ఈ బిర్యాని కి 23 కేరట్ల తినే బంగారం తో గార్నిష్ చేస్తారట. అందుకే ఈ బిర్యానీ అంత ఖరీదు. ఇలా బంగారు పూతతో వడ్డిస్తారు కాబట్టే దీనిని గోల్డ్ బిర్యానీ అని పిలుస్తారు. ఈ బిర్యానీలో చాలా రకాల బాస్మతి రైస్, కుంకుమపువ్వు, గుడ్లు, జీడిపప్పు, దానిమ్మ గింజలు, కశ్మీరీ గొర్రె కబాబ్స్, ఫేమస్ రాజ్ పుత్ చికెన్ కబాబ్స్, నోరూరించే మొఘలాయి కోఫ్తా వంటి పదార్ధాలను పెట్టి వాటిపై 23 కేరట్ల తినే బంగారాన్ని అలంకరిస్తారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన బిర్యానీఅట.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.