సంతానం లేని దంపతులకు In Vitro Fertilization (IVF) అనే ప్రక్రియ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇది కొంత ఖరీదైన వ్యవహారం. అందువల్ల కేవలం కొందరు మాత్రమే IVFకు వెళ్తుంటారు. అయితే ఈ ప్రక్రియలో స్త్రీ నుంచి అండాన్ని, పురుషుడి నుంచి శుక్రకణాలను సేకరించి రెండింటినీ ల్యాబ్లో ఫలదీకరణం చెందిస్తారు. తరువాత పిండాన్ని స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. అయితే కరోనా వల్ల IVFకు వెళ్లేందుకు చాలా మంది దంపతులు వెనుకడుగు వేస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
లాక్డౌన్ వల్ల 3 నెలల పాటు IVF క్లినిక్స్ మూసి ఉన్నాయి. ఆంక్షలను సడలించడంతో వాటిని కూడా ప్రస్తుతం తెరుస్తున్నారు. అయితే చాలా తక్కువ మంది దంపతులు మాత్రమే ప్రస్తుతం IVFకు వెళ్తున్నారు. గతంలో IVF చికిత్స కోసం ప్లాన్లు వేసుకున్న వారు మరో 6 నెలల వరకు వేచి చూసే భావనలో ఉన్నారని వైద్య నిపుణులు తెలిపారు. కరోనా వల్ల చాలా మంది దంపతులు భయపడుతున్నారని, అందువల్ల వారు IVFకు రావడం లేదని వైద్యులు తెలిపారు.
అయితే IVF ప్రక్రియలో ఆలస్యం చేసేకొద్దీ సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ విషయంపై కూడా దంపతులు ఆందోళన చెందుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. అయితే 6 నెలల వరకు వేచి చూస్తే పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదని, కనుక 6 నెలల తరువాత వారు ఎప్పటిలా IVF ప్రక్రియను కొనసాగించవచ్చని సూచిస్తున్నారు. అప్పటి వరకు ఎలాగూ వ్యాక్సిన్ వస్తుంది కనుక.. అప్పటి వరకు ఆగితే వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు. అందువల్ల IVFకు వెళ్లాలనుకుంటున్న దంపతులు జాగ్రత్తలను పాటిస్తామనుకుంటే ఇప్పుడే అందుకు వెళ్లవచ్చని, లేదనుకుంటే 6 నెలల వరకు ఆగవచ్చని వారు సూచిస్తున్నారు.