Couples: ఈ రోజుల్లో మనకు ఎలాంటి సందేహం వచ్చిన గూగుల్ వెంటనే సందేహం తీర్చేస్తుంది. కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించి చడం తో పాటు చదువులు ఆన్లైన్కు వచ్చిన సమయంలో ప్రజలు గూగుల్లో ఎలాంటి విషయాలు ఎక్కువగా వెతికారు అనే దానిపై కొందరు నిపుణులు అధ్యయనం చేపట్టగా కొన్ని బాధాకరమైన విషయాలు బయటపడ్డాయి .ఎక్కువ మంది మగవాళ్లు గూగుల్లో భార్యలపై ఎలా పైచేయి సాధించాలి అనే విషయాన్ని వెతికినట్టు సర్వేలో తెలిసింది. ఈ అధ్యయనంలో మరిన్ని ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. లాక్ డౌన్ టైం లో ప్రపంచవ్యాప్తంగా గృహహింస గణనీయంగా పెరిగిందని ఆందోళన కలిగించే అంశం వెల్లడయింది. సుదీర్ఘ లాక్డౌన్ వలన చాలామంది మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది అనడం లో ఎలాంటి సందేహం లేదు .
ముఖ్యంగా మగవారి లో పెరిగిన ఫ్రస్టేషన్ ఎవరి మీద చూపించాలి అనేది తెలియక తమ భాగస్వామి పై చూపించారు. దాని ఫలితం గా స్త్రీ పై హింస పెచ్చుమీరింది అని అధ్యయనం తెలియచేస్తుంది. అధ్యయన ఫలితాలను టేలర్ అండ్ ఫ్రాన్సిస్ జర్నల్లో పబ్లిష్ చేసారు. లాక్డౌన్ లో చాలా మంది మగవారిలో నిరాశ,అభద్రత, నిస్సహాయత పెరగడం వలన ఉద్దేశపూర్వకంగానే భర్తలు తమ భాగస్వామి పై హింసకు సిద్ధపడ్డారని , ఈ హింస 31% నుంచి 106% వరకు పెరిగింది అని తెలియచేస్తున్నారు. లాక్డౌన్ లో ఉన్నప్పుడు చాలా మంది మగవారు ‘భార్యను కంట్రోల్ లో పెట్టడం ఎలా?’ ‘అని ఎవ్వరికీ తెలియకుండా భార్య ను ఎలా కొట్టాలి.. ’ అనే విషయాలను గూగుల్లో 16.50 కోట్ల సార్లు సెర్చ్ చేశారు అని తెలియచేసారు. వీటితో పాటు “భార్యను ఇంట్లోనే ఎలా చంపాలి?” అనే దాన్ని 17.80 కోట్ల సార్లు వెదికారు అని అధ్యయనంలో బయట పడింది. భర్త పెట్టె హింసలు తట్టుకోలేక భార్యలు “నా భర్త నన్ను చంపేస్తారు” అని 10.7 కోట్ల సార్లు, ‘నన్ను కొడతాడు’ అని 32 కోట్ల సార్లు గూగుల్లో వెదికారు అని తేలింది. “దయచేసి నాకు సహాయం చెయ్యండి” అని అనేక మంది స్త్రీలు 1.22 బిలియన్ సార్లు గూగుల్లో సెర్చ్ చేశారు అని అధ్యయనం తెలిపింది.
లాక్డౌన్ టైం లో ప్రజలు ఇంటికే అంకితం అవడం తో , తమ సమస్య ను ఎవరికీ చెప్పుకోలేక, గూగుల్ సెర్చ్ ను ఆశ్రయించారు. ఈ లాక్డౌన్ టైం లో ప్రజలు ఎలాంటి విషయాలను వెతికారో తెలుసుకోవడానికి మాత్రమే ఈ అధ్యయనం చేసారు. నా అధ్యయనంలో స్త్రీలు గృహ హింస కి గురి అయ్యారు అనే భయంకర మైన విషయం బయటకు వచ్చింది అని నిపుణులు తెలియజేశారు. లాక్డౌన్ టైం లోనే గృహ హింస కేసులు ఎక్కువగా నమోదైన విషయం ఈ పరిశోధనకు బలాన్ని చేకూరుస్తుంది.