తమిళ్ హీరో విశాల్ ఓ ఫైనాన్షియర్ కు డబ్బులు బకాయి పడ్డారు. అందుకు ఆ ఫైనాన్షియర్ కోర్టులో కేసులో వెయ్యగా విశాల్ కు ఎదురు దెబ్బ తగిలినట్లు సమాచారం. ఈ విషయమై విశాల్ సదరు ఫైనాన్షియర్ కు భారీ మొత్తంలో నగదు చెల్లించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలలోకి వెళితే… విశాల్ ఓ ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లించకపోవడంతో ఆ ఫైనాన్షియర్ కోర్టు ను ఆశ్రయించాడట. ఫైనాన్షియర్ విజయ్ కొఠారి దగ్గర నుండి హీరో విశాల్ రూ. 50 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. పందెం కోడి-2 చిత్రం షూట్ కొరకు విశాల్ అతని దగ్గర డబ్బును తీసుకున్నాడట. కానీ తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఫైనాన్షియర్ కొఠారి కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ కేసు మొత్తంను క్షుణ్ణంగా విచారించిన న్యాయస్థానం కొఠారికి రూ.50 లక్షలు చెల్లించాలని విశాల్ ను ఆదేశించిందట.
గతంలో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పోటీ చేసి అందులో గెలుపొందిన హీరో విశాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నట్లు సమాచారం. చెన్నై నగరంలోని ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం విశాల్ ‘నోటా’ ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘ఎనిమీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ నటుడు ‘ఆర్య’ నెెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మిర్నాలిని రవి హీరోయిన్ గా నటిస్తోందట. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు SS థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వినోద్ కుమార్ నిర్మిస్తున్నాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?