ఢిల్లీ, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని నేషనల్ హెరాల్డ్ వార్త సంస్థ (ఎజెఎల్)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యింది.
ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంట్రల్ ఢిల్లీలోని ఆఫీసు ఖాళీ చేయాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది.
హైకోర్టు డిసెంబర్లో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం కోర్టు కొట్టివేసింది.
దేశ రాజధాని ప్రాంతంలో ఢిల్లీ – ఐటీవో భవనంలో హెరాల్డ్ సంస్థ గత 56ఏళ్లుగా కొనసాగుతోంది.
హెరాల్డ్ హౌస్లో గత పదేళ్లుగా పత్రికా కార్యాలయం నడవడం లేదని, లీజు నిబంధనలను ఉల్లంఘించి వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రాంగణాన్ని ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ కేంద్రం లీజును రద్దు చేసింది.
56 ఏళ్ల లీజును రద్దు చేస్తూ భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా అక్టోబర్ 30నే హెరాల్డ్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. అక్కడా ఎదురు దెబ్బ తగిలింది. రెండు వారాల్లోగా ఖాళీ చేయాలని కోర్టు స్పష్టం చేసింది.