హైదరాబాద్, ఏప్రిల్ 2: చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీనటుడు, ఇటీవలే వైసిపిలో చేరిన మంచు మోహన్బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి కోర్టులో దాఖలు చేసిన చెక్ బౌన్స్ కేసు పిటిషన్పై న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు.
మోహన్బాబు ఇచ్చిన 41లక్షల 75వేల రూపాయల చెక్కు చెల్లకపోవడంతో సినీ నిర్మాత చౌదరి మోహన్బాబుపై 2010లో కేసు నమోదు చేశారు.
కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు న్యాయమూర్తి మోహన్బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు.
దీనిపై మోహన్బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.