ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ కీలకఘట్టం లోనికి ప్రవేశించింది. ఈ రోజున దేశ వ్యాప్తంగా covaxin హ్యూమన్ ట్రావెల్స్ ను ప్రారంభించారు.
భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ను 12 చోట్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుండగా వాటిల్లో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి మరియు వైజాగ్ కు చెందిన కింగ్ జార్జి ఆసుపత్రి కూడా ఉన్నాయి. ఇక ఈ వ్యాక్సిన్ కు హ్యూమన్ ట్రయల్స్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది.
మొదటి దశలో 150 మందికి మరియు రెండవ దశలో ఏడు వందల యాభై మందికి హ్యూమన్ ట్రావెల్స్ ను వ్యాక్సిన్ ద్వారా నిర్వహిస్తారు. ఇక అందులో వచ్చే ఫలితాలను బట్టి వ్యాక్సిన్ ఎప్పుడు విడుదల అయ్యేది అన్న విషయంపై స్పష్టత వస్తుంది.
ఐసీఎంఆర్ ఆశావహంగా ఆగస్టు 15 తేదీ నాటికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నా శాస్త్రవేత్తలు మాత్రం ఈ ఏడాది లోపల వచ్చే అవకాశం లేదని అంటున్నారు.