COVID-19: భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ గత వారం రోజుల్లో తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ నాలుగు లక్షలకు మించి కేసులు దేశంలో నమోదు వస్తున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. వారిని పూడ్చి పెట్టేందుకు స్థలాలు లేక నదిలోకి పారవేసిన సంఘటనలు కూడా చూశాం. అయితే గత కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
హెల్త్ కేర్ వర్కర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల ప్రశంసనీయ పనితీరుతో కరోనా ప్రభావం తగ్గిందనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం లాక్ డౌన్. దాదాపు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని అమలు పరుస్తున్నాయి. అలాగే విదేశాల నుండి రావలసిన ఆక్సిజన్ ట్యాంకర్లు, వెంటిలేటర్ పరికరాలు కూడా భారతదేశం చేరుకోవడంతో మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.
ఇక ఈ సమయంలోనే మోదీ ఒక హై లెవల్ మీటింగ్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఖచ్చితమైన లెక్కలను చూపించాలని ఆదేశించారు. ఖచ్చితమైన కోవిడ్ లెక్కలు చూపించి అందులో మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని అర్థం కాదని ఈ సమయంలో విశ్వసనీయత ప్రజలు కోరుకుంటున్నారని మోడీ చెప్పారు.
ఇక మనం చూసుకున్నట్లయితే మార్చి మొదట్లో వారానికి దేశవ్యాప్తంగా 50 లక్షలకు టెస్టులు జరిగేవి. అయితే ప్రస్తుతం వారానికి 1.3 కోట్ల టెస్టులు జరుగుతున్నాయి. ఇక మోడీ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ పల్లెలకు కూడా ఆక్సిజన్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని.. అందుకోసం ఆశా మరియు అంగన్వాడీ వర్కర్ లను వాడుకోవాలని తెలిపారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈనెల ఆఖరకు సెకండ్ ప్రభావం పూర్తిగా క్షీణిస్తుందని తెలుస్తోంది.