COVID 19: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూడవ వేవ్ కి భారతదేశం సిద్ధమవుతోంది. యుద్ధప్రాతిపదికన అందుకు అవసరమైన చర్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వం తీసుకోవడం మొదలుపెట్టాయి. అయితే ఇదే సమయంలో లో పూణే లోని సైంటిస్టులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.
కరోనా వైరస్ నుండి కోలుకున్న వారికి తొమ్మిది నెలల పాటు వైరస్ నుండి రక్షణ ఉంటుందని వారు చెప్పారు. వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ అధ్యయనంలో కేవలం 11 మందికి మాత్రమే మరలో కోవిడ్ సోకింది. దాదాపు 9 నెలల పాటు ఈ అధ్యయనం జరిగింది. అంటే కరోనా నుండి కోరుకున్న వారిలో కేవలం 1.2% మంది మాత్రమే మళ్లీ ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. అలాగే మళ్లీ ఇన్ఫెక్ట్ అయిన 13 మంది కూడా స్వల్ప లక్షణాలు ఉండటం తక్కువ సమయంలోనే వారు పూర్తిగా వైరస్ నుండి కోల్పోవడం విశేషం.
గతంలో ఆస్ట్రేలియన్ సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో కోవిడ్ నుండి కోలుకున్న వారిలో ఏడు నెలల పాటు రోగనిరోధక శక్తి ఉంటుందని తెలియజేశారు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు మాత్రం ఆ రక్షణ తొమ్మిది నెలల వరకు ఉంటుందని అన్నారు. అలాగే వీరిలో కోవిడ్ వైరస్ ప్రవేశించడం అనేది చాలా అరుదు అని తెలియజేశారు. ఇక సహజంగా వచ్చిన రోగనిరోధక శక్తి వల్ల తయారైన యాంటీబాడీలు కూడా భవిష్యత్తులో రాబోయే కొత్తరకం వేరియంట్స్ తో సమర్థవంతంగా పోరాడుతాయని తెలిపారు.
అలా లేని పక్షంలో కూడా వీరిపై వైరస్ పెద్దగా ప్రభావం చూపించదని చిన్న చిన్న లక్షణాలతోనే వారు ఆ వేరియంట్స్ నుంచి బయట పడతారు అని తెలిపారు. అయినప్పటికీ వస్తున్న కొత్త వేరియంట్లకి సంబంధించిన పూర్తిస్థాయి రిపోర్టులు బయటికి రావాలి కాబట్టి కోవొడ్ నుండి కోరుకున్న వారైనా కూడా కరోనా జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే. ఇక వీరు కూడా వ్యాక్సినేషన్ తప్పక వేయించుకోవాలని… వచ్చే వేరియంట్లలో ఎటువంటి జన్యుపరమైన మార్పులు ఉంటాయో ఊహించలేము కాబట్టి చాలామంది వీటి వల్ల ఇబ్బంది పడవచ్చు. ఇక వ్యాక్సినేషన్ అయితే తప్పనిసరి అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.