Covid 3rd wave: ప్రస్తుతం భారత దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఇంకెన్ని రోజులు ఉంటుంది అని అందరిలో ఒక ప్రశ్న మెదులుతోంది. దీని దెబ్బకు ఇప్పుడే లక్షలాది జనం అల్లాడిపోతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పరచిన ప్యానెల్ చెబుతున్నదాని ప్రకారం ఈ సంవత్సరం జూలై నెల నాటికి సెకండ్ ముగిసిపోతుందట.
అలాగే మూడవ వేవ్ అప్పటి నుండి ఒక ఆరు లేదా ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత మరలా మన దేశం లోకి ప్రవేశిస్తుంది అని చెబుతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుచేసిన ప్యానెల్ లో ముగ్గురు సైంటిస్టులు ఉన్నారు. వీరిలో ఐఐటి కాన్పూర్ కి చెందిన ప్రొఫెసర్ అయిన మహేంద్ర అగర్వాల్ ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ మూడవ కరోనా వేవ్ ప్రభావం పెద్దగా ఏమీ ఉండదని… అక్కడక్కడ కొన్ని కేసులు నమోదు అవుతాయి అని తెలిపారు.
వ్యాస్కినేషన్ ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తే అందుకు కారణమని ఆయన అన్నారు. ఇక ఈ నెల ఆఖరికి దేశంలో రోజూ 1.5 లక్షల కేసులు నమోదు కావచ్చని… అలాగే జులై నెల చివరికల్లా రోజుకి దేశ వ్యాప్తంగా కేవలం 20 వేల కేసులు మాత్రమే నమోదు అవుతాయని వారు రిపోర్టు ఇచ్చారు.
అలాగే కరోనా సెకండ్ ముగిసిన తర్వాత ఆరు నుండి ఎనిమిది నెలల్లో మూడు కచ్చితంగా వస్తుందని చెబుతున్నారు. ఇప్పటి నుండే ప్రతి రాష్ట్రంలో జిల్లావ్యాప్తంగా, నగరవ్యాప్తంగా కావలసిన జాగ్రత్తలు తీసుకుంటే మూడవ వేవ్ ని పూర్తిగా నివారించవచ్చు అని కూడా వారు ఆశిస్తున్నారు.