మహమ్మారి కరోనా వైరస్ రోజు రోజుకి వ్యాప్తి చెందుతుంది.. ఈ వైరస్ వచ్చి సంవత్సరం అయింది.. అయితే మొదట్లో కరోనా టెస్టులు సోకిన వారికి వారి ఇంట్లో వారికే పరిమితమయ్యాయి.. దాని విజృంభన పెరిగేకొద్దీ రోగి తో పాటు ప్రాథమిక వ్యక్తులను చుట్టుపక్కల వారికి పరిమితమయ్యాయి.. వైరస్ వ్యాప్తి తీవ్రత పెరగడంతో ఆ పరీక్షలు వృద్ధులు, షుగర్, డయాబెటిస్, ఆస్తమా ఉన్న వారికి కూడా చేయడం ప్రారంభించారు.. అయితే వచ్చిన చిక్కేమిటంటే..? అడుగడుగున తప్పిదాలే..? ఇందులో కూడా డూప్లికేట్ కేసుల నమోదు చూసి అధికారులు నివ్వెరపోయారు..! తాజాగా తెలంగాణలో ప్రజా ఆరోగ్య కేంద్రం (పిహెచ్ సి) పరీక్షల నమోదు సంఖ్యలపై దర్యాప్తు చేయగా నకిలీ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి..! పూర్తి వివరాలు ఇలా..
డేటా లో అవకతవలపై విస్తుపోయిన అధికారులు..
రాపిడ్ యాంటిజెన్ పరీక్షల కోసం తెలంగాణ ఆరోగ్య శాఖ నియమించిన టెస్టింగ్ ప్రోటోకాల్ రోగి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ ఇవ్వడంలో జరిగిన అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.. ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలో డేటా కేంద్రాలలో సేకరించిన డేటా ఎంట్రీ యాదృచ్చిక ఒకరికి నమోదు చేసినా ఒకే ఫోన్ నెంబర్లు చిరునామాలు ఉపయోగించి ఎక్కువ రిజిస్ట్రేషన్లు ఉన్నాయని కనుగొన్నారు.. అయితే అక్టోబర్లో వరద వినాశనం కారణంగా ప్రజలు ఇంటిలోపలే ఉన్నప్పటికీ ఈ సంఖ్య స్థిరంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. డిసెంబర్ 1న జి.హెచ్.ఎం.సి ఎన్నికలు జరిగిన రోజున కూడా 60 మందికి కేంద్రంలో పరీక్ష జరిగినట్లు రికార్డులు ఉన్నాయి..
టార్గెట్.. కొంపముంచింది..?
వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి 60 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కాబట్టి ఆ పరీక్షల కోసం రోగులను సమీకరించడానికి అక్రెడిట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా) సిబ్బంది సహాయం తీసుకుంటున్నట్లు పి హెచ్ సి లోని ల్యాబ్ టెక్నీషియన్ తెలిపారు. అయితే వారు చాలా మందిని పరీక్షలు కు తీసుకు రావడానికి సాధ్యపడటం లేదన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ యాక్సెప్ట్ చేసిన ఆరోగ్యశ్రీ సర్వర్ ద్వారా నాలుగు అంకెల కోడ్ ఉత్పత్తి, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ అందించడం వారి పని. వారికి టార్గెట్ ఇచ్చిన పరీక్షల సంఖ్య 50 నుంచి 60 మధ్య పి హెచ్ సి లలో మారుతుండగా ఏరియా ఆసుపత్రికి రోజుకు 200 పరీక్షలను లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే అనుకున్నన్నీ టెస్టులు నిర్వహించడం లేకపోవడం వలన వారు ఒకరికి నమోదు చేసినా ఫోన్ నెంబరు, చిరునామా వివరాలను మరొకరికి కూడా అవే వివరాలను నమోదు చేస్తున్నారు..
ఈ విషయంపై ప్రజా ఆరోగ్య డైరెక్టర్ మాట్లాడుతూ మహమ్మారి ప్రారంభం నుంచే తెలంగాణకు డేటా సమస్య ఉందన్నారు. మార్చి 2వ తేదీన తెలంగాణలో మొదటి కేసు నమోదైన నాటి నుంచి జూన్ 17 వరకు రాష్ట్రంలో రోజుకు సగటున 429 పరీక్షలు చేసింది. రాబోయే రోజుల్లో హైదరాబాదులో 50000 పరీక్షలు నిర్వహిస్తామని జూన్ 15న ప్రకటించినప్పుడు తరవాత ఆ సంఖ్యలు మారిపోయాయి. అయితే రాపిడ్ యాంటీజెన్ పై ఆధారపడి 80 శాతం ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. సెప్టెంబర్ – డిసెంబర్ మధ్య యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన పరీక్ష కేసులలో 352 మంది డేటా లో 110 మంది సమాచారం అనుమానితంగా ఉందని అన్నారు.