కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్గుప్తా (83) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు సార్లు లోక్సభకు, మూడు సార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి దశాబ్దాల కాలం పార్లమెంటేరియన్గా సేవలు అందించిన గురుదాస్ దాస్గుప్తా అనారోగ్యంతో బాధపడుతూ నేటి ఉదయం కోల్కతా, భవానీపూర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జయశ్రీ దాస్ గుప్తా, ఒక కుమార్తె ఉన్నారు. గురుదాస్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో భాగంగా ఉన్న బారిసలా ప్రాంతంలో 1936 నవంబర్ మూడవ తేదీన జన్మించారు.
previous post