అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల రీటెండరింగ్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు ఆయన బుధవారం లేఖ రాశారు.ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులను ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వాస్తవ ధర కంటే 14శాతం తక్కువ మొత్తానికే నవయుగ కంపెనీ చేపట్టేందుకు ముందుకు వచ్చిందని రామకృష్ణ తెలిపారు. కాంక్రీట్ పనుల నిర్వహణలో ఆ నిర్మాణ సంస్థ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదే కంపెనీతో ప్రాజెక్టు పనులు కొనసాగించాలని రామకృష్ణ సూచించారు. రీటెండరింగ్ విధానం వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు పనుల్లో జాప్యం పెరుగుతుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టర్లను మార్చడం వల్ల ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకం అవుతుందని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
previous post