అమరావతి: రాజధాని మార్పు చేస్తే రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తుళ్లూరు మండలంలోని రాజధాని ప్రాంతంలో రైతులతో కలిసి ఆయన గురువారం పర్యటించారు. నీరుకొండ, ఐనవోలు, తుళ్లూరు ప్రాంతాలు పర్యటించి హైకోర్టు తదితర భవనాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని ముంపు ప్రాంతమని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దురుద్దేశంతో కూడినవని విమర్శించారు. అమరావతిలో ఏ గ్రామం వరద నీటిలో మునిగిందో మంత్రి చూపించాలని రామకృష్ణ కోరారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపారని రామకృష్ణ గుర్తు చేశారు. కొంత మంది స్థిరాస్థి వ్యాపారులను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న అనుమానం కలుగుతోందని రామకృష్ణ అన్నారు. ఇప్పటికైనా జగన్మోహనరెడ్డి రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసి రైతాంగంలో ఉన్న భయాందోళనలను తొలగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?