ముంబాయి, జనవరి 8: చారిత్రాత్మక ఆసీస్ టెస్టు సిరీస్ విజయం సాధించిన టీం ఇండియాకు భారత క్రికెట్ కంట్రోలు బోర్డు భారీ నజరానా ప్రకటించింది. జట్టుకు మ్యాచ్ ఫీజుతో సమానంగా బోనస్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఒకొక్క మ్యాచ్కు 15 లక్షల రూపాయల వంతున, రిజర్వ్ ఆటగాళ్ళకు 7.5లక్షల రూపాయల వంతున, కోచ్లకు 25 లక్షల వంతున ఇవ్వనున్నట్లు బోర్డు వెల్లడించింది. సహాయక సిబ్బందికి కూడా బోనస్ ఇస్తున్నట్లు బోర్డు తెలిపింది.
ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ నెగ్గాలన్న భారత జట్టు కలను కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలో జట్టు సాధించి చరిత్ర సృష్టించింది.