Breaking: భారత టీం మాజీ ఆటగాడు స్టార్ట్ లెగ్ స్పిన్నర్ క్రికెటర్ అనిల్ కుంబ్లే సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి పుష్ప గుచ్చం అందించి అనిల్ కుంబ్లే సత్కరించారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ స్థాపించడానికి అనిల్ కుంబ్లే ఆలోచనలు చేస్తున్నట్లు.. ఈ సందర్భంగా క్రికెట్ అకాడమీ స్థలం కోసం.. సీఎం జగన్ తో మంతనాలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.
భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ కూడా అనిల్ కుమార్ లేని శాలువాతో సత్కరించడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పేసిన తర్వాత ప్రస్తుతం అనిల్ కుంబ్లే..ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ స్థాపించడానికి అనిల్ కుంబ్లే ఆలోచన చేస్తున్నట్లు దానికోసమే.. తాజాగా సీఎం జగన్ ని క్యాంపు కార్యాలయంలో కలిసినట్లు వార్తలు అందుతున్నాయి. టీమిండియాకు 18 సంవత్సరాల పాటు తన సేవలు అందించిన అనిల్ కుంబ్లే.. తన కెరియర్ లో మర్చిపోలేని కొన్ని జ్ఞాపకాలు ఫోటోలను ఒక ఆల్బమ్ ఫ్రేమ్ లో పొందుపరిచి జగన్ కి గిఫ్ట్ గా అందించడం జరిగింది.