పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ పరిస్థితులు బట్టి చూస్తే బిజెపి వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మమతా బెనర్జీ మరోసారి అధికారం తమకే దక్కాలని.. అనేక వ్యూహాలు వేస్తూ ఉంది. పోత్తులతో సరికొత్త ఎత్తుగడలతో రాణిస్తోంది.
ఇటువంటి తరుణంలో ఎప్పటినుండో క్రికెటర్ గంగూలీ బెంగాల్ రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు వార్తలు రాగా అవి తాజాగా నిజమైనట్టు పరిణామాలు అక్కడ మారాయి. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. తాజాగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ తో ప్రత్యేకంగా గంగూలీ సమావేశం అయ్యారు. దీంతో ఈ సమావేశం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే చాలామంది ప్రముఖ రాజకీయ నేతలు బీజేపీ పార్టీలో చేరుతున్నారు. మమతా బెనర్జీ పార్టీకి చెందిన నాయకులు కూడా బీజేపీలో ఇటీవల జాయిన్ అవ్వడం మనకందరికీ తెలిసిందే. అటువంటిది ఎప్పటినుండో సౌరవ్ గంగూలీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లు బిజెపిలో జాయిన్ అవుతున్నట్లు వార్తలు రాగా తాజాగా ఆయన గవర్నర్ తో భేటీ అవటంతో ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. ఇదిలా ఉంటే జరిగిన సమావేశం కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే అనే టాక్ వస్తోంది. మరోపక్క గంగూలీ బిజెపిలో జాయిన్ అయితే ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇదే గనుక నిజమైతే మమతా బెనర్జీ కి రోజులు దగ్గర పడినట్లే అన్న టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే కమలనాథులతో గంగూలి టచ్ లో ఉన్నట్లు ఇదే తరుణంలో మమతా బెనర్జీకి టెన్షన్ ఉన్నట్లు బెంగాల్ రాజకీయవర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.