టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ లోని రూర్కీ వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఢిల్లీ – డెహ్రాడూన్ జాతీయ రహదారిపై హరిద్వార్ జిల్లాలోని మంగళూర్ – నర్సన్ మధ్య డివైడర్ కు ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన వెంటనే కారు నుండి రిషబ్ బయటకు దూకేయ్యడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను ముందుగా రుర్కీ అసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెగురైన వైద్యం కోసం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో రిష్ పంత్ వీపు, నుదురు, కాలుపై గాయాలు అయ్యాయని హరిద్వార్ రూరల్ ఎస్పీ తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. డెహ్రాడూన్ ఆసుపత్రిలో పంత్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. పూర్తి పరీక్షలు నిర్వహించిన తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వెల్లడించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన రిషబ్ పంత్ కు చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జై షా సహా పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆకాంక్షిస్తూ ట్వీట్ చేస్తున్నారు.
రిషబ్ పంత్ ఇటీవల బంగ్లాాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆడారు. వచ్చే నెల లో శ్రీలంకతో జరగనున్న టీ 20 సిరీస్ టీమ్ కు పంత్ ఎంపిక కాలేదు.ఇక క్రిస్మస్ వేడుకలను పంత్ .. మాజీ కెప్టెన్ ధోనితో కలిసి దుబాయ్ లో జరుపుకున్నారు. న్యూఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి సీసీ టీవీ విజ్యువల్స్ ను పోలీసులు పరిశీలించారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీకొట్టినట్లుగా రికార్డు అయ్యింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ऋषभ पंत की कार का CCTV आया सामने…ऋषभ पंत कार खुद चला रहे थे.ईश्वर उन्हें जल्दी ठीक करे. @RishabhPant17 #Rishabpant pic.twitter.com/ien2JNtLba
— Rahul Sisodia (@Sisodia19Rahul) December 30, 2022