నాకు వ్యవసాయం నేర్పుతావ..? ఒక సారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది..! ఎందుకా ఈ డైలాగ్ అనుకుంటున్నారా..? భారత క్రికెట్ జట్టుకు రెండు ప్రపంచ కప్ లు అందించిన ధోని..2020 స్వాతంత్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ గురిచేశాడు.. క్రికెట్ మైదానంలో ఇన్నాళ్లు మెరుపులు మెరిపించిన ధోనీ.. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలోకి దిగాడు..! బ్యాట్ పట్టిన చేత్తోనే విత్తనాలు నాటుతున్నాడు.. రైతుగా మారి..! కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు..!
వ్యవసాయం గురించి మహేష్ బాబు.. మహర్షి.. సినిమాతో చెప్తే.. ధోని ఏకంగా చేసి చూపిస్తున్నాడు..అందుకే ఆర్థికవేత్తలు అంటారు.. భారతదేశానికి వ్యవసాయం వెన్నుముక అన్ని.. తనకి నచ్చిన వ్యవసాయాన్ని ఆదాయ మార్చుకున్నాడు.. రాంచీలోని దుర్వార లో మహేంద్ర సింగ్ ధోనీ కి 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు.. మోస్ట్ పాపులారిటీ తెచ్చుకున్న క్రికెటర్ 100 కోట్లు ఉన్న కానీ, క్రికెట్ నుంచి వైదొలగిన తర్వాత వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను అమ్ముతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు..
అంతేకాకండా ధోని కోళ్ల పరిశ్రమ కూడా ప్రారంభించాడు. మధ్యప్రదేశ్ కు చెందిన 2000 కడక్ నాథ్ కోళ్లు కొనుగోలు చేసి తన ఫామ్ హౌస్ లో పెంచుతున్నాడు.కడక్ నాథ్ కోళ్ల పర్యవేక్షణ తీసుకునేందుకు ప్రత్యేకంగా వైద్యులను కూడా నియమించాడు..వీటితో పాటు పాల పరిశ్రమల కూడా ఏర్పాటు చేశాడు. 70 మేలుజాతి ఆవులను పంజాబ్ నుంచి తెప్పించి వాటి ద్వారా 300 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నాడు. మార్కెట్లో లీటర్కు 50 రూపాయలకు అమ్ముతున్నాడు.ఈ పాల అమ్మకాల కోసం ప్రత్యేకంగా కొన్ని ఏరియాలలో పాల బూత్ లను కూడా ఏర్పాటు చేశాడు.
పొలంలో పండిన టమోటా, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకోలి వంటి కూరగాయలను రాంచీలో అమ్ముతున్నాడు. ప్రతి రోజు దాదాపు 80 కిలోల టమోటా మార్కెట్ కి పంపుతున్నాడు. ప్రస్తుతం టమోటాలను 40 రూపాయలకు అమ్ముతున్నారు. త్వరలోనే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మార్కెట్కు తరలించడానికి సిద్ధం చేస్తున్నాడు.
వీటి ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా తన ఖాతాలోకి వెళ్ళుతుంది. ఈ ఫామ్ హౌస్ ద్వారా ప్రస్తుతానికి రూ.6 లక్షల ఆదాయం అందుకుంటున్న ధోని రాబోయే రోజుల్లో రూ. 25 లక్షల దాకా రావచ్చని అంచనా మాత్రమే..