Crime News: ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవ ప్రదమైనది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది. కానీ ఆ ఉపాధ్యాయుడి బుద్ధి వక్రమార్గం పట్టింది. ఓ నేరానికి పాల్పడి వ్యక్తిగత డ్రైవర్, వంట మనిషితో సహా పోలీసులకు చిక్కి కటకటాల పాలైయ్యాడు. ఆయన చేసిన పాడు పనికి సహచర ఉపాధ్యాయులు నివ్వెరపోయారు.
Read More: Video Viral: ట్రైన్ లోకో పైలట్ సమయస్పూర్తి..! వృద్ధుడికి తృటిలో తప్పిన ప్రాణాపాయం..!!
వివరాల్లోకి వెళితే..పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపిలో మద్యం దరలు వివరీతంగా పెంచి అమ్మకాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విక్రయాలు జరుగుతుండటంతో వినియోగదారులకు కావాల్సిన బ్రాండ్ లు కూడా లభ్యం కావడం లేదు. దీంతో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి ఏపిలోని సరిహద్దు ప్రాంతాల వారు మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నిత్యం పెద్ద సంఖ్యలో అక్రమ మద్యం వాహనాలు పట్టుబడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే రొద్దం ప్రాధమిక పాఠశాల పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్న సిరాజుద్దీన్ కర్నాటక నుండి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆర్ కొట్టాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. కారులో హెచ్ఎం సిరాజుద్దీన్ తో పాటు ఉన్న వ్యక్తిగత డ్రైవర్, వంట మనిషిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఎస్ఐ మనోహర్ వీరిపై కేసు నమోదు చేసి మడకశిర కోర్టు మెజిస్ట్రేట్ వద్ద హజరు పర్చారు. మెజిస్ట్రేట్ వారు ముగ్గురికి ఈ నెల 30వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో సబ్ జైలుకు తరలించారు. ప్రధానోపాధ్యాయుడు మద్యం కేసులో పట్టుబడ్డారని గ్రామంలో తెలియడంతో గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇదేమి పని అంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సహచర ఉపాధ్యాయులు విస్మయానికి గురవుతున్నారు.