Crime News: కొందరు క్షణికావేశంలో చేసిన పనులు వారి జీవితాలనే తల్లికిందులు అవుతుంటాయి. వయసు పైబడుతున్నా వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్న కుమార్తెపై ఆమె తండ్రి చేసిన పనికి ఊరంతా ఒక్క సారిగా షాక్ అయింది. ఈ ఘటనలో అతని కుమార్తె మృతి చెందగా అతను కటకటాల పాలైయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని ఝూరై గ్రామంలో అశోక్ వైశ్ (69) కుతురు అంకు వైశ్ (30) తన భార్య నివసిస్తున్నారు. కుమార్తె అంకు వైశ్ భోపాల్ లోని ఓ కళాశాలలో బి ఫార్మసీ చదువుతోంది. లాక్ డౌన్ కారణంగా కళాశాలలు మూసివేయడంతో కొన్ని నెలలుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసి తమ బరువు దించుకోవాలని చూస్తున్నారు. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలని భావించి వత్తిడి చేయడంతో ఆమె ఒప్పుకోవడం లేదు. 30 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా వివాహానికి అంగీకరించకపోవడంతో ఇంకా కొన్ని నెలలు ఆగితే సంబంధాలు కూడా రావని గట్టిగా ఒత్తిడి చేశారు. పెళ్లి విషయంలో ఎప్పటికప్పుడు తండ్రి, కూతురి మధ్య వాగ్వివాదం జరుగుతుండేవి.
ఈ క్రమంలోనే మరో సారి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో తండ్రిపై కూమార్తె ఎదిరించింది. కుమార్తె ఎగర్చిండంతో తీవ్ర ఆవేశానికి గురైన అశోక్ వైశ్ తన బెడ్ రూమ్ లోకి వెళ్లి పిస్టల్ తీసుకువచ్చి కూతురిపై గురి పెట్టాడు. దీంతో భయపడిన ఆమె వంట గదిలోకి పరుగెత్తి దాక్కుంది. అశోక్ అక్కడకు వెళ్లి ఆమెను కాల్చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అశోక్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కుమార్తె భర్త చేతిలోనే హత్యకు గురి కావడం, భర్త జైలు పాలు కావడంతో అశోక్ భార్య పరిస్థితి అగమ్యగోచరంగా మరింది. వివాహానికి ఒప్పుకోవడం లేదని తండ్రే కన్న కూతురిని కాల్చి చంపాడని తెలుసుకుని గ్రామస్తులు ఒక్క సారిగా షాక్ అయ్యారు.