ఇటీవల దేశంలో అత్యాచారా ఘటనలు ఉన్న కొద్ది ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. అత్యాచారాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు నిర్ణయాలు తీసుకుంటున్న గాని సమాజంలో మార్పు లేని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలా ఉండగా మహిళలకు అండగా నిలవాల్సిన రాజకీయ నేతలే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై తేలిగ్గా తీసి పడేసె రీతిలో మాట్లాడటం ఇటివాళ కేరళ రాష్ట్రంలో జరిగింది. పూర్తి విషయంలోకి వెళితే కేరళ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ ముళ్ళపల్లి రామచంద్రన్ కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు.
ఆత్మగౌరవం ఉన్న ఏ మహిళ అయినా తనపై అత్యాచారం జరిగితే వెంటనే చనిపోతుందని లేదంటే మరోసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతుంది అని అన్నారు. కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ చేసిన ఈ కామెంట్ లో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. బయట జనాలు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో రావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
మహిళలకు అండగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఇలా మాట్లాడితే రేపు మరింతగా సమాజంలో ఉన్న జనాలు రెచ్చిపోతారు అని అంటున్నారు. చాలామంది ప్రముఖులు కూడా ముల్లపల్లి రామచంద్రన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఓ నిరసన కార్యక్రమంలో చేసిన ఈ కామెంట్లు పెను దుమారాన్ని రేపడం తో తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రజలకు అదేవిధంగా మీడియాకి సంజాయిషీ చెప్పడానికి కేరళ కాంగ్రెస్ చీఫ్ ప్రయత్నం చేశారు.