భారత్ లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 28,178 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. 540 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 9,07,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 23,727 మంది మృతి చెందారు. కోలుకున్న వారి సంఖ్య 5,72,112గా ఉంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 3,11,442గా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా 1,32,35,751 ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 5,75,525 మంది మృతి చెందారు. కరోనా నుంచి 76,96,381 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 49,63,895గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 1935 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య 19,247కు చేరుకుంది. 24గంటల్లో 37మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,274 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 36, 221కి చేరుకుంది. నిన్న ఒక్కరోజులో 9మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో12,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికి మొత్తం మృతుల సంఖ్య 365కి చేరుకుంది.