Curd Rice: ఆధ్యాత్మిక నిపుణులు
సిద్ధి వినాయకుడిని, స్వర్ణ గౌరిని నీటిలో వదిలే సందర్భం లో కాస్త పెరుగన్నం నైవేద్యంగా పెట్టి దాన్ని తిన్నా,లేదా దానం చేసినా ఇంట్లో చక్కని ప్రశాంతత, సంతోషం,శాంతి వంటివి కలుగుతాయి అని ఆధ్యాత్మిక నిపుణులు తెలియచేస్తున్నారు. ప్రతి నెలా వచ్చే అమావాస్య కి , మహాలయ పక్షాలు జరిగే సమయంలో పెరుగన్నం దానం చేయడం వలన అన్ని పితృశాపాలు నశించి పోతాయి.
దీనితో పాటు కులదేవతలకు కూడా పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టడం వలన ఇంట్లో గొడవలు తగ్గి సుఖసంతోషాల తో వర్ధిల్లుతారు.
Curd Rice: ధనవృద్ధి కలుగుతుంది
ఏదైనా శనివారం రోజు కులదేవతలకు నైవేద్యంగా పెరుగన్నం పెడితే, ఇంట్లోఉన్న అప్పుల బాధలు తొలగి పోతాయి. పెరుగన్నాం లో దానిమ్మ పండు గింజలను కలిపి మీ కులదేవతలకు నైవేద్యం గా పెట్టి , దాన్ని దానం చేస్తే శత్రువుల వలన కలిగే బాధలు నశించి పోతాయి.
అలాగే శనివారం రోజు ఒక స్టీలు పళ్లెంలో అరటి ఆకు వేసి దానిపైన పెరుగన్నం పెట్టి, పళ్లెంతో సహా తాంబూలం పెట్టి అవన్నీ కలిపి దానం ఇస్తే, అన్ని రకాల మోకాళ్ల నొప్పుల తో పాటు, ఎముకల సమస్యలు కూడా త్వరగా తగ్గిపోతాయి. అదేవిధం గా శ్రావణమాసంలో శ్రీ మహా లక్ష్మీ కి పెరుగన్నం నైవేద్యంగా పెట్టడం వలన ధనవృద్ధి కలుగుతుంది. శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయాలలో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి తాంబూలంతో కలిపి పెరుగన్నాన్ని దానం చేయడం వలన మీ ఇంట్లో ధనం సంవృద్ధిగా ఉంటుంది.
అష్టమి నుంచి మొదలుకుని పౌర్ణమి
అదేవిధం గా అష్టమి నుంచి మొదలుకుని పౌర్ణమి వరకు చంద్రునికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టడం వలన గొప్ప ధనవంతులు గా మారతారు.దానికోసం ప్రతిరోజూ రాత్రి పెరుగు అన్నాన్ని చంద్రునికి నైవేద్యంగా పెట్టాలి. ఆ పెరుగన్నం వీలైనంతవరకు అరటి ఆకులో పెట్టాలి అది కుదరక పొతే , చిన్నపాటి వెండిగిన్నెలో అయినా పెట్టవచ్చు. అష్టమి నుంచి ప్రారంభించకపోయినాకూడా ద్వాదశి తిథి నుంచి అయినా పెరుగన్నంను చంద్రునికి నైవేద్యంగా పెట్టడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు.